AP News:నిరుద్యోగ యువతకు ఏపీ సర్కార్ భారీ గుడ్ న్యూస్

by Jakkula Mamatha |
AP News:నిరుద్యోగ యువతకు ఏపీ సర్కార్ భారీ గుడ్ న్యూస్
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. తమ ప్రభుత్వంలో కక్ష సాధింపులు ఉండవని, అందరికీ ఉపాధి కల్పించడమే ద్యేయంగా పాలన సాగుతోందని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు. గాంధీ మహాత్ముని ఆశయ సాధనలో భాగంగా ఏపీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఇందు కోసం ప్రతి జిల్లాలోనూ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. శనివారం మంగళగిరిలోని ఏపీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు కార్యాలయాన్ని మంత్రి తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆమె కార్యాలయం ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఆధ్వర్యంలో ఉపాధి కల్పనకు సబ్సిడీతో కూడిన రుణాలివ్వనున్నట్లు తెలిపారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ, ఉపాధి కల్పన లేకపోవడంతో యువత తీవ్ర ఆవేదనకు గురయ్యారన్నారు. యువత భవిష్యత్తుకు భరోసా కల్పించాలన్న ధ్యేయంతో చంద్రబాబు ప్రభుత్వం ఉపాధి కల్పనకు, ఉద్యోగాల భర్తీకి నడుం బిగించిందని మంత్రి సవిత తెలిపారు. విద్యతో సంబంధం లేకుండా నిరక్షరాస్యులకు కూడా ఈ రుణాలివ్వనున్నట్లు మంత్రి తెలిపారు. రూ.5 లక్షల నుంచి 50 లక్షల వరకు రుణాలివ్వనున్నామని మంత్రి సవిత పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed