Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్

by Disha Web Desk 16 |
Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు బదిలీ అయిన విషయం తెలిసిందే. ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న సీతారామాంజనేయులతో పాటు విజయవాడ సీపీ కాంతి రాణాపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేసిన ఫిర్యాదులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆదేశించింది. అయితే తాజాగా ఎన్నికల కీలక నిర్ణయం తీసుకుంది. బదిలీ అయిన వీరి స్థానంలో మరో ఇద్దరు అధికారులను నియమించారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్‌, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణను నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం ఉదయంలోపు బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించింది.



Next Story

Most Viewed