CM Chandrababu : ఆర్ అండ్ బీ శాఖపై.. ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష!

by Geesa Chandu |
CM Chandrababu : ఆర్ అండ్ బీ శాఖపై.. ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష!
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో ధ్వంసమైన రోడ్ల మరమ్మత్తులపై దృష్టి పెట్టాలని.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్ అండ్ బీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు ఆర్ అండ్ బీ శాఖకు సంబంధించిన అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి.. వరదల వల్ల మొత్తం ఎన్ని కిలోమీటర్ల మేర, రోడ్లు దెబ్బతిన్నాయన్న విషయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అయితే, ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4 వేల కిలోమీటర్లకు పైగా రోడ్లు దెబ్బతిన్నాయని ఆర్ అండ్ బీ అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. దీంతో ప్రాధాన్యతల వారిగా దెబ్బతిన్న రోడ్లకు మరమ్మత్తులు చేపట్టాలని సీఎం అధికారులకు సూచించారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టం అంచనాలపై రివ్యూ నిర్వహించిన చంద్రబాబు, ఆ తర్వాత విజయవాడ లోని కలెక్టర్ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు, ఇంకా ఇన్స్యూరెన్స్ ఏజెన్సీ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు చంద్రబాబు. కాగా ఇటీవల కురిసిన వర్షాలు, వరదలకు వేలాది వాహనాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed