కేంద్రమంత్రి పాటిల్‌తో చంద్రబాబు కీలక భేటీ.. చర్చించిన అంశాలు ఇవే..!

by srinivas |
కేంద్రమంత్రి పాటిల్‌తో చంద్రబాబు కీలక భేటీ.. చర్చించిన అంశాలు ఇవే..!
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టుపై ఆయనతో సీఎం చర్చించారు. పోలవరం పూర్తి చేస్తామని బడ్జెట్ సందర్భంగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపిన విషయాన్ని సీఆర్ పాటిల్ దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రప్రభుత్వానికి తమ కేబినెట్ ధన్యవాదాలు తెలిపినట్లు ఆయనకు వివరించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తి స్థాయి ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని పాటిల్‌ను చంద్రబాబు కోరారు. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి అంగీకారం తెలపాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు తొలి దశ నిర్మాణానికి అవసరమైన రూ. 12 వేల కోట్ల ప్రతిపాదనలకు కేంద్రం ఒకే చెప్పిందని పాటిల్‌కు చంద్రబాబు వివరించారు.

Advertisement

Next Story

Most Viewed