AP:వైసీపీకి మరో బిగ్ షాక్..టీడీపీ గూటికి కీలక నాయకులు

by Jakkula Mamatha |   ( Updated:2024-08-28 15:26:31.0  )
AP:వైసీపీకి మరో బిగ్ షాక్..టీడీపీ గూటికి కీలక నాయకులు
X

దిశ, పల్నాడు:సత్తెనపల్లి వైసీపీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటిదాకా ఆ పార్టీలో కీలకంగా ఉన్న నాయకులంతా వరుసగా టీడీపీ తీర్థం తీసుకుంటున్నారు. వారం క్రితం నకరికల్లు ఎంపీపీ అనూరాధ భర్త మేచవరపు రామాంజనేయులు, పలువురు సర్పంచులు ఎంపీటీసీలు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో టీడీపీలో చేరారు. అలాగే, ఈ మండలం నుంచి మాజీ జెడ్పీటీసీ, ఆయన అనుచర వర్గం పార్టీ మారేందుకు ఎమ్మెల్యే కన్నాకు టచ్‌లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది.

వైసీపీలో ఎవరైనా మిగులుతారా..

ముప్పాళ్ళ ఉప ఎంపీపీ చిన రంగయ్య మరో నలుగురు ఎంపీటీసీలు టీడీపీలో చేరారు. అలాగే, రాజుపాలెం సత్తెనపల్లి రూరల్ మండలాల నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో నియోజకవర్గంలోని ముప్పాళ్ళ, రాజుపాలెం, నకరికల్లు, సత్తెనపల్లి రూరల్ ఎంపీపీ స్థానాలు టీడీపీ క్లీన్ స్వీప్ చేసుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ నాలుగు మండలాల్లో వైసీపీ ఎంపీపీలు గా కొనసాగుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed