AP Elections 2024: ఎన్నికల్లో పోటీ చేయడం పై నటుడు పృధ్వి స్పష్టత

by Indraja |
AP Elections 2024: ఎన్నికల్లో పోటీ చేయడం పై నటుడు పృధ్వి స్పష్టత
X

దిశ వెబ్ డెస్క్: రానున్న ఎన్నికల్లో పోటీచేయడం పైన నటుడు పృధ్వీరాజ్ స్పష్టత ఇచ్చారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రానున్న ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టత ఇచ్చారు. ఇక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వదిలిన బాణం తానని పేర్కొన్నారు. ఇక రానున్న ఎన్నికల ప్రచారం లో పాల్గొంటానని తెలిపిన పృధ్వి.. అంబటి రాంబాబు పై విమర్శల జల్లు కురిపించారు. రాష్ట్రంలో అభివృద్ధి గురించి పక్కన పెట్టి డ్యాన్సులు, సినిమాలు, కలెక్షన్లు, డిస్టిబ్యూటర్ల గురించి మాట్లాడేవాళ్లు మినిస్టర్లా అని మండిపడ్డారు. అసలు ప్రాజెక్టుల గురించి అంబటి రాంబాబుకు తెలుసా అని ప్రశ్నించిన ఆయన.. ఎప్పుడు చూడు పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు, రెండు చోట్ల ఓటమి గురించే మాట్లాడతారు కానీ.. ఒక్కసారైనా ప్రాజెక్టుల గురించి అంబటి రాంబాబు మాట్లాడారా..? అని అంబటి రాంబాబు పై తీవ్ర విమర్శలు చేశారు.

మాటకు ముందు పవన్ మూడు పెళ్లిళ్ల ప్రస్తావన తెస్తారని.. అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల ప్రస్తావన తెచ్చి జారుకుంటారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లకు సంబంధం ఏమైనా ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేసిన పృధ్వి.. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడం కారణంగానే పోలవరం ప్రాజెక్టు ఆగిందా..? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నిలిచిపోయిందా అని ఎద్దేవ చేశారు. వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు తెస్తానని.. ఒక్క రాజధాని కూడా లేకుండా చేశారని. నేడు దేశం లో రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తనను వాడుకుని వదిలేసినా అధికార పార్టీకి సమాధానం చెప్పే రోజు అతి దగ్గర లోనే ఉందని పేర్కొన్నారు.

Advertisement

Next Story