హంద్రీనీవా కాలువలో చిక్కుకున్న 25 మంది కూలీలు

by M.Rajitha |
హంద్రీనీవా కాలువలో చిక్కుకున్న 25 మంది కూలీలు
X

దిశ, వెబ్ డెస్క్ : కర్నూలు జిల్లాలోని హంద్రీనీవా కాలువలో 25 కూలీలు చిక్కుకున్నారు. జిల్లాలోని గోనెగండ్ల మండలం గుంజహళ్లి వద్ద కాలువలో వీరంతా చిక్కుకున్నట్టు సమాచారం. ఎగువన కురుస్తున్న వర్షాలకు గాజుల దిన్నె ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. ఇన్ఫ్లో ఎక్కువ ఉండటంతో ఆ నీటిని హంద్రీనీవాలోకి వదులుతున్నారు. అయితే అవతలి గట్టున పంట పొలాల్లోకి పనులకు వెళ్ళిన కూలీలు తిరిగి వచ్చే క్రమంలో ప్రవాహ ఉదృతి గమనించక నీటిలోకి దిగారు. ప్రవాహం ఎక్కువ ఉండటంతో వారంతా సహాయం కోసం ఆర్తనాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని రక్షించేదుకు సహాయక చర్యలు చేపట్టగా.. స్థానికులు, పోలీసులు కలిసి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

Next Story

Most Viewed