పార్టీకి, పదవులకు రాజీనామా చేసిన వైసీపీ ఎంపీలు

by Mahesh |   ( Updated:2024-08-29 07:40:15.0  )
పార్టీకి, పదవులకు రాజీనామా చేసిన వైసీపీ ఎంపీలు
X

దిశ, వెబ్ డెస్క్: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు కీలక నేతలు రాజీనామా చేశారు. కాగా వీరు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ముగ్గురు నేతలు కీలక పదవులు అనుభవించారు. తాజాగా పార్టీకి రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు కూడా పార్టీకి రాజీనామా చేసేందుకు నిర్ణయించుకున్నారు. అనంతరం గురువారం రోజు వీరు పార్లమెంట్ చేరుకుని ఎంపీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు.. రాజ్యసభ చైర్మన్ కు వారి రాజీనామా పత్రాలు అందించారు. కాగా ఏకకాలంలో ఇద్దరు వైసీపీ పార్టీకి, తమ పదవులకు రాజీనామా చేశారు. కాగా వీరు టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని.. ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిగాయని.. అయితే తమ పదవులకు రాజీనామా చేసి వస్తేనే పార్టీలోకీ తీసుకుంటామని.. టీడీపీ పెద్దలు చెప్పినట్లు తెలుస్తుంది. అన్నీ కుదిరితే కొద్దిరోజుల్లోనే ఈ ఇద్దరు మాజీ ఎంపీలు టీడీపీలో చేరనున్నారు.

Advertisement

Next Story

Most Viewed