పాకిస్తాన్‌లో ఇండియా కవి జావేద్ చేసిన వ్యాఖ్యలు వైరల్

ప్రముఖ రచయిత, కవి జావేద్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. గత వారం పాకిస్తాన్ లో... Viral: Javed Akhtar, In Pakistan, Says 26/11 Attackers "Still Roaming Free

Update: 2023-02-21 11:10 GMT

న్యూఢిల్లీ: ప్రముఖ రచయిత, కవి జావేద్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. గత వారం పాకిస్తాన్ లో పర్యటించిన ఆయన 26/11 దాడులకు పాల్పడిన ఉగ్రవాదలనుద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. 26/11 ఉగ్రవాదులు పాకిస్తాన్ లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని అన్నారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను తగ్గించడం గురించి ఆయన మాట్లాడారు. ఇరు దేశాలు ఒకరికొకరు సమస్యలు పరిష్కరించుకోవాలని అన్నారు. అయితే తాము ముంబై నుంచి వచ్చామని అక్కడ దాడులకు పాల్పడిన వారు ఇంకా ఇక్కడ తిరుగుతున్నారని చెప్పారు. ఇది హిందుస్థానీలకు ఆగ్రహం కలిగిస్తుందని తెలిపారు. అయితే భారత కళాకారులకు పాకిస్తాన్ సరైన గౌరవం ఇవ్వదని విమర్శించారు. భారత్ మాత్రం పాకిస్తాన్ కళాకారులకు తగిన అతిథ్యం కల్పించిందని గుర్తు చేశారు. అయితే జావేద్ వ్యాఖ్యలపై పలువురు ప్రశంసలు వ్యక్తం చేశారు. ఇదొ రకమైన సర్జికల్ స్ట్రైక్ అని అన్నారు.

Tags:    

Similar News