రబత్ : మొరాకోలో శుక్రవారం అర్ధరాత్రి సంభవించిన భారీ భూకంపంలో మరణించిన వారి సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. ఆదివారం రాత్రి నాటికి చనిపోయిన వారి సంఖ్య 2,122కు చేరింది. ఇక గాయాలతో ఆస్పత్రిపాలైన వారి సంఖ్య 2,421కి పెరిగింది. గాయపడ్డవారిలో దాదాపు 1500 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. మొరాకోలో 6.8 తీవ్రతతో భూకంపం సభవించింది. భూకంప కేంద్రం మరకేష్ నగరానికి నైరుతి దిశలో ఉన్నట్లు గుర్తించారు. మొరాకోలో గత 120 ఏళ్లలో ఇంత భారీగా భూప్రకంపనలు రావడం ఇదే తొలిసారి అని అంటున్నారు.