భర్తపై భార్య ఫిర్యాదు: పాపకి బీర్ తాగిస్తూ, ఏడాదిగా శృంగారంలో..

దిశ, వెబ్ డెస్క్: ప్రతి తల్లిదండ్రులు తమ కూతుర్ని తమకన్నా మంచిగా చూసుకునేవాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. ఇక ఎన్నారై సంబంధమే వస్తే ఎగిరి గంతేస్తారు. ఎంత కట్నం ఇచ్చి అయినా పెళ్లి చేద్దాం అనుకుంటారు. ఆ తరువాత కూతురు విదేశాల్లో హ్యాపీ గా ఉందని భావిస్తూ కాలం గడుపుతారు. కానీ అక్కడ ఆ కూతురు పడే భాధలు వర్ణనాతీతం అని, అవి బయటకు వెలుగుచూసినప్పుడే తెలుస్తుంది. తాజాగా ఒక ఎన్నారై ని పెళ్లిచేసుకొని, నరకయాతన పడిన […]

Update: 2021-04-03 01:48 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రతి తల్లిదండ్రులు తమ కూతుర్ని తమకన్నా మంచిగా చూసుకునేవాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. ఇక ఎన్నారై సంబంధమే వస్తే ఎగిరి గంతేస్తారు. ఎంత కట్నం ఇచ్చి అయినా పెళ్లి చేద్దాం అనుకుంటారు. ఆ తరువాత కూతురు విదేశాల్లో హ్యాపీ గా ఉందని భావిస్తూ కాలం గడుపుతారు. కానీ అక్కడ ఆ కూతురు పడే భాధలు వర్ణనాతీతం అని, అవి బయటకు వెలుగుచూసినప్పుడే తెలుస్తుంది. తాజాగా ఒక ఎన్నారై ని పెళ్లిచేసుకొని, నరకయాతన పడిన ఒక వివాహిత తన భర్త చేసిన అఘాయిత్యాలను పోలీసుల వద్ద వాపోయింది.

గుజరాత్ కి చెందిన ఒక కుటుంబంలోని యువతికి ఎన్నారై సంబంధం వచ్చింది. దీంతో సంతోషపడ్డ తల్లిదండ్రులు భారీ మొత్తంలో కట్నం ముట్టజెప్పి కూతురికి ఘనంగా పెళ్లి చేశారు. గుజరాత్ లో ఉన్నంతవరకు భార్యను బంగారంలా చూసుకున్న ఆ భర్త.. ఇక ఎప్పుడైతే దుబాయ్ ఫ్లైట్ ఎక్కడో అప్పటినుండి అసలు రంగు బయటపెట్టాడు. దేశం కానీ దేశంలో అదనపు కట్నం కోసం రోజు భార్యను చిత్ర హింసలు పెట్టడం మొదలు పెట్టాడు. ఇంట్లో భార్యను వదిలేసి ఎప్పుడెప్పుడో ఇంటికి వచ్చేవాడు. ఈ విషయాలన్నీ తల్లిదండ్రులకు చెప్తుందేమో అని భార్య కు ఫోన్ లేకుండా చేశాడు. ఇక ఈ ఏడాది మార్చి లో ఆమెను భారత్ లో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. దీంతో వివాహిత అహ్మదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తన భర్త తనను వేధిస్తున్నాడని, ఏడాది నుండి తనతో శృంగారంలో పాల్గొనడం లేదని, కన్న కూతురు అని చూడకుండా రెండేళ్ల పాపకి బీర్ తాగిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. భారత్ లో బాగానే ఉన్నా దుబాయ్ వెళ్ళాకా ప్రత్యక్ష నరకం చూపించాడని వాపోయింది. తనకు ఎలాగైనా న్యాయం చేయాలనీ పోలీసులను వేడుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News