మహిళ మీదకు దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

దిశ, సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గోపాల్‌నగర్‌లో నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై నుంచి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. కరీంనగర్ డిపోకు చెందిన ఆర్డినరీ బస్సు సిరిసిల్ల నుంచి కామారెడ్డికు బయలుదేరింది. గోపాల్‌నగర్ వద్ద దుర్గేశ్వర అనే మహిళ రోడ్డు డివైడర్‌పై నుంచి దాటుతుండగా, ఎదురుగా వస్తున్న బస్సు మహిళ పైనుంచి వెళ్లడంతో ఆమె అక్కడే నుజ్జునజ్జయింది. మృతురాలిది సిరిసిల్లలోని వెంకంపేట పోలీసులు తెలిపారు.

Update: 2020-07-16 09:42 GMT

దిశ, సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గోపాల్‌నగర్‌లో నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై నుంచి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. కరీంనగర్ డిపోకు చెందిన ఆర్డినరీ బస్సు సిరిసిల్ల నుంచి కామారెడ్డికు బయలుదేరింది. గోపాల్‌నగర్ వద్ద దుర్గేశ్వర అనే మహిళ రోడ్డు డివైడర్‌పై నుంచి దాటుతుండగా, ఎదురుగా వస్తున్న బస్సు మహిళ పైనుంచి వెళ్లడంతో ఆమె అక్కడే నుజ్జునజ్జయింది. మృతురాలిది సిరిసిల్లలోని వెంకంపేట పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News