కిందపడిన యువకులను తొక్కేసిన లారీ

దిశ‌, అందోల్: సంగారెడ్డి జిల్లా మునిప‌ల్లి మండ‌లం కంకోల్ టోల్ గేట్ స‌మీపంలో ముంబై జాతీయ ర‌హ‌దారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్దరు యువ‌కులు అక్కడిక‌క్కడే మృతి చెందారు. ఇందుకు సంబంధించిన వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. హైద‌రాబాద్ నుంచి కర్ణాట‌క రాష్ట్రం బీద‌ర్ వైపు ద్విచ‌క్ర వాహ‌నంపై వెళ్తుండ‌గా, కంకోల్ వ‌ద్దకు రాగానే బండి అదుపుత‌ప్పింది. దాంతో వారు కింద ప‌డిపోయారు. వారి వెనుకాలే వస్తున్న లారీ వారిద్దరిపై నుంచి […]

Update: 2021-10-28 11:48 GMT

దిశ‌, అందోల్: సంగారెడ్డి జిల్లా మునిప‌ల్లి మండ‌లం కంకోల్ టోల్ గేట్ స‌మీపంలో ముంబై జాతీయ ర‌హ‌దారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్దరు యువ‌కులు అక్కడిక‌క్కడే మృతి చెందారు. ఇందుకు సంబంధించిన వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. హైద‌రాబాద్ నుంచి కర్ణాట‌క రాష్ట్రం బీద‌ర్ వైపు ద్విచ‌క్ర వాహ‌నంపై వెళ్తుండ‌గా, కంకోల్ వ‌ద్దకు రాగానే బండి అదుపుత‌ప్పింది. దాంతో వారు కింద ప‌డిపోయారు. వారి వెనుకాలే వస్తున్న లారీ వారిద్దరిపై నుంచి అతివేగంగా వెళ్లడంతో వారిద్దరూ అక్కడిక‌క్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి మునిప‌ల్లి పోలీసులు చేరుకుని మృత‌దేహాల‌ను స‌దాశివ‌పేట ప్రభుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కాగా వారిద్దరూ క‌ర్ణాట‌క ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు. మృతుల పేర్లు, వివ‌రాలు తెలియాల్సి ఉంది. ఈ మేర‌కు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News