రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

దిశ, వెబ్‌డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మణుగూరు మండలం రామానుజవరం పంచాయతీ పరిధిలోని గొర్రెపేట వాగు వద్ద టిప్పర్- ట్రాక్టర్ ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. టిప్పర్ మణుగూరు నుంచి బొగ్గు లోడుతో వెళ్తుండగా.. ట్రాక్టర్ మణుగూరు నుంచి పినపాక వెళ్తున్నట్లు సమాచారం. రెండు వాహనాలు ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో పినపాకకు చెందిన వెంకన్న, కృష్ణారావు మృతి చెందినట్లు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు […]

Update: 2020-10-07 08:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మణుగూరు మండలం రామానుజవరం పంచాయతీ పరిధిలోని గొర్రెపేట వాగు వద్ద టిప్పర్- ట్రాక్టర్ ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. టిప్పర్ మణుగూరు నుంచి బొగ్గు లోడుతో వెళ్తుండగా.. ట్రాక్టర్ మణుగూరు నుంచి పినపాక వెళ్తున్నట్లు సమాచారం. రెండు వాహనాలు ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో పినపాకకు చెందిన వెంకన్న, కృష్ణారావు మృతి చెందినట్లు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News