ఖమ్మం జిల్లాలో తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్: మంత్రి పువ్వాడ

దిశ ప్రతినిధి, ఖమ్మం: స్థానిక సంస్థల కోటాలో శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుసుదన్ విజయంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సీఎం కేసీఆర్ వెంటే నడుస్తుందనే విషయం స్పష్టం అయిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఎన్నికలో సహకరించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు పార్టీ నేతలకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విపక్షాలకు ఈ తీర్పు చెంపపెట్టు అని అన్నారు.ఆరు స్థానాల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ […]

Update: 2021-12-14 01:53 GMT

దిశ ప్రతినిధి, ఖమ్మం: స్థానిక సంస్థల కోటాలో శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుసుదన్ విజయంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సీఎం కేసీఆర్ వెంటే నడుస్తుందనే విషయం స్పష్టం అయిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఎన్నికలో సహకరించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు పార్టీ నేతలకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విపక్షాలకు ఈ తీర్పు చెంపపెట్టు అని అన్నారు.ఆరు స్థానాల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థులకు మంత్రి పువ్వాడ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిపక్షాల కుట్రలను తిప్పి కొట్టే విధంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా టీఆర్ఎస్ ను బలపరిచినందుకు ఓటర్లకు మంత్రి పువ్వాడ కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజాదరణకు ఇది దిక్సూచి..

జిల్లాలో టీఆర్ఎస్ కి పెరుగుతున్న ప్రజాదరణకు ఇది దిక్సూచి అని మంత్రి చెప్పారు. ఈ విజయంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతమైన శక్తిగా రూపొందిందన్నారు. టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని మరోసారి రుజువైందని, శాసన మండలిలోని స్థానిక సంస్థల కోటా నుంచి జరిగిన ఎన్నికల్లో మొత్తం 12 స్థానాలు గెలిచి, క్లీన్ స్వీప్ చేయడం గర్వకారణమన్నారు. ఈ 12 సీట్లలో 6 స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకోవడం, పోలింగ్ జరిగిన మిగిలిన ఆరు స్థానాల్లో భారీ మెజారిటీతో గెలవడం టీఆర్ఎస్, సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వం పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసమే ఈ గెలుపుకు నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రజానీకం టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని మరోసారి రుజువైందన్నారు. ఈ విజయాలతో మరింత ఉత్సాహంతో ప్రజలకు సేవ చేస్తామని, ప్రజల ఆదరాభిమానాలు టీఆర్ఎస్ కు కొండంత అండ అని మంత్రి పేర్కొన్నారు.

తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్..

స్థానిక సంస్థల కోటాలో శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుసుదన్ విజయం సాధించడం పట్ల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఆరు స్థానాల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థులు తాతా మధు, భానుప్రసాద్ రావు, రమణ, విఠల్, యాదవరెడ్డి, కోటిరెడ్డిలకు మంత్రి పువ్వాడ శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని మరోసారి రుజువైందని, శాసన మండలిలోని స్థానిక సంస్థల కోటా నుంచి జరిగిన ఎన్నికల్లో మొత్తం 12 స్థానాలు గెలచి, క్లీన్ స్వీప్ చేయడం శుభపరిణామం అన్నారు. గవర్నర్ కోటా నుంచి ఎమ్మెల్సీగా నియమితులైన మధుసూదనాచారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు తెలిపిన ప్రజాప్రతినిధులకు, సహకరించిన పార్టీ శ్రేణులకు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.

Tags:    

Similar News