VIRAL: ఆడదానికి ఆడదే శత్రువు.. బాలికను పొట్టు పొట్టు కొట్టిన అమ్మాయిలు

సాధారణంగా మన అమ్మమ్మల కాలంలో ఆడవారు ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా వంటి గదికే పరిమితం అయ్యేవారు.

Update: 2024-08-25 08:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా మన అమ్మమ్మల కాలంలో ఆడవారు ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా వంటి గదికే పరిమితం అయ్యేవారు. కానీ, ఇప్పుడు మారుతున్న కాలానుగుణంగా అమ్మాయిలు సమాజంలో బయటకు వచ్చి స్వేచ్ఛగా జీవిస్తున్నారు. కొంతమంది దీన్ని అదునుగా చేసుకొని రెచ్చిపోతున్నారు. అయితే మనం చాలా సార్లు ఆడదానికి ఆడదే శత్రువు అని అంటుండడం వినే ఉంటాం.. కానీ, ఇప్పుడు ఈ వీడియో చూస్తే వినడమే కాదు అవును నిజమే అని ఫైనల్ చేసేస్తారు. వివరాల్లోకి వెళితే..

ముంబైలోని అంధేరి వెస్ట్‌లో ఉన్న నానా నానీ పార్క్ వద్ద చోటుచేసుకున్న ఘటన ప్రకారం.. పాఠశాలకు వెళుతున్న ఓ బాలికపై కొందరు యువతులు దాడి చేశారు. ఐదారుగురు అమ్మాయిలు కలిసి బాలికను బూతులు తిడుతూ పిడిగుద్దులతో ఘోరంగా కొట్టారు. ఈ తతంగాన్ని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్ అయింది. అది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కాగా అంతలా ఆ బాలికను కొట్టాల్సిన అవసరం ఏంటో ఇంకా తెలియరాలేదు.

(video link credits to harikavichitti instagram id)


Similar News