Trending: విజయవాడను ముంచెత్తిన వరదలు.. ఓ హృదయవిదారక దృశ్యం
విజయవాడలో భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి.
దిశ, వెబ్డెస్క్: విజయవాడలో భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. దీంతో ప్రభుత్వం వరద బాధితులకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి తాత్కాలికంగా ఊరట కల్పిస్తున్నారు. వారికి అక్కడ భోజన సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే పట్టణంలోని అజిత్సింగ్ నగర్లోని బుడమేరు ముంపు ప్రాంతంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అక్కడ కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. వరద ప్రవాహంలో కోట్టుకొచ్చిన ఓ మహిళ డెడ్బాడీ కారుపై వచ్చి చేరింది. అయితే, అక్కడి వెళ్లి ఆ డెడ్బాడీని తీసేందుకు ఎవరూ సాహసించకపోవడంతో కొన్ని గంటలుగా ఆ మృతదేహం అక్కడే ఉంది. సమాచారాన్ని స్థానికులు అధికారులకు తెలియజేసినా వాళ్ల నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదని వారు వాపోయారు.