Trending: పిల్ల వరాహానికి పాలిచ్చిన గోమాత.. సోషల్ మీడియాలో వీడియో వైరల్ (వీడియో)
ఆకలితో అలమటిస్తున్న వరాహానికి గోమాత పాలిచ్చిన వింత ఘటన పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
దిశ, వెబ్డెస్క్: ఆకలితో అలమటిస్తున్న వరాహానికి గోమాత పాలిచ్చిన వింత ఘటన పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని రామ మందిరం వద్ద ఓ గోమాత విశ్రాంతి తీసుకుంటోంది. అయితే, అదే సమయంలో వచ్చిన ఓ పిల్ల వరాహం ఎలాంటి అదురు బెదరు లేకుండా గోమాత పొదుగును పట్టి పాలు తాగింది. తన జాతి కాకపోయినా.. బిడ్డ ఆకలి తల్లికే తెలుసన్నట్లుగా ఆ గోమాత పిల్ల వరాహాన్ని బెదరగొట్టకుండా పాలిచ్చింది. అయితే, ఈ చిత్రం చూసిన జనం ఓకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. గోమాత పందికి పాలివ్వడం ఏంటని ఆసక్తిగా తిలకించారు.
వీడియో కోసం పక్కనే ఉన్న లింక్ క్లిక్ చేయడం: https://x.com/bigtvtelugu/status/1830493874374017126