మతి భ్రమించిందా!.. శ్రీకృష్ణుడికి చికెన్ బిర్యాని తినిపించిన మహిళ (వీడియో వైరల్)

కళియుగ ఆరాధ్య దైవమైన శ్రీకృష్ణుడికి ఓ మహిళ చికెన్ బిర్యాని తినిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Update: 2024-06-30 11:27 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కళియుగ ఆరాధ్య దైవమైన శ్రీకృష్ణుడికి ఓ మహిళ చికెన్ బిర్యాని తినిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్ల రూపంలో దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ వీడియోలో ఓ మహిళ హిందూ దేవుళ్ల విగ్రహాలను బెడ్ పై ఉంచి ఘనంగా అలంకరించింది. ఆ విగ్రహాలకు హరతి ఇచ్చి పూజలు కూడా నిర్వహించింది. అనంతరం ఓ ప్లేట్ లో మాంసంతో చేసిన బిర్యాని వడ్డించుకొని వచ్చింది. ముద్దలు కలిపి అక్కడ ఉన్న విగ్రహాలకు తినిపిస్తున్నట్టుగా చూపించింది. దీనికి సంబందించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహానికి గురైతున్నారు. భారతదేశంలోనే కాక ప్రపంచంలోనే కోట్లాది మంది ప్రజలు శ్రీకృష్ణుడిని పూజిస్తారని మీరు తెలుసుకోవాలి. ఒకరి విశ్వాసాన్ని అవమానించడం మొత్తం మానవాళికే వ్యతిరేకం అని మండిపడుతున్నారు. కృష్ణ భగవానుడికి మాంసాహారం అందించడం అవమానకరమైన చర్య అని, ఆమెకు మతి భ్రమించి అలా ప్రవర్తించి ఉండవచ్చు అని, వీడియో చూస్తే మహిళ సాంప్రదాయంగా చీరకట్టు, బొట్టుతో ఉంది. ఎవరైనా కావలని ఆమెతో అలా చేయించి ఉంటారేమోనని పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.


Similar News