Trending: ఫుల్లుగా మందేసి చిందేసిన ఒంగోలు ఏఎస్సై.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న వీడియో

కంచే చేను మేసేలా తయారైంది ఒంగోలు పోలీసుల తీరు. శాంతిభద్రతలు కాపాడాల్సిక ఖాకీలే విఘాతం కలిగించేలా వ్యవహరిస్తూ డిపార్ట్‌మెంట్‌కు చెడ్డపేరు తీసుకొస్తున్నారు.

Update: 2024-07-02 04:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: కంచే చేను మేసేలా తయారైంది ఒంగోలు పోలీసుల తీరు. శాంతిభద్రతలు కాపాడాల్సిక ఖాకీలే విఘాతం కలిగించేలా వ్యవహరిస్తూ డిపార్ట్‌మెంట్‌కు చెడ్డపేరు తీసుకొస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండల పరిధిలోని శంకరాపురంలో ఇటీవల ఇరు పార్టీల మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలో రెండు వర్గాలు బాహాబాహీకి దిగగా ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఓ వర్గానికి చెందిన వారిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ క్రమంలో మళ్లీ గొడవలు పునరావృతం కాకుండా ఉండేందుకు గ్రామంలో పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారులు అక్కడ ఏఎస్సై వెంకటేశ్వర్లుకు డ్యూటీ వేశారు. అయితే, విధి నిర్వహణను విస్మరించిన అతడు గ్రామ శివారులోకి వెళ్లి మందుబాబులతో ఎంచక్కా మందేసి చిందులేశాడు. ఆ దృశ్యాలను అటుగా వెళ్తున్న కొందరు సెల్‌ఫోన్లలో రికార్డు చేసి ఉన్నతాధికారులకు పంపారు. ఈ పరిణామంతో ఏఎస్సైను వేకెన్సీ రిజర్వ్‌(వీఆర్‌)కు పంపుతూ జిల్లా ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం ఐజీ కార్యాలయానికి నివేదిక సైతం పంపినట్లుగా తెలుస్తోంది.

Similar News