AP News:ప్రభుత్వ రికార్డుల దహనం పై ఆరా తీసిన డిప్యూటీ సీఎం పవన్
విజయవాడలోని కృష్ణా కరకట్టపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చెందిన రికార్డులను దగ్ధం చేసిన ఘటన చోటుచేసుకుంది.
దిశ,వెబ్డెస్క్:విజయవాడలోని కృష్ణా కరకట్టపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చెందిన రికార్డులను దగ్ధం చేసిన ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రభుత్వ రికార్డులను దగ్ధం చేసేందుకు యత్నించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాజీ చైర్మన్ సమీర్ శర్మ , కారు డ్రైవర్ నాగరాజుగా పోలీసులు గుర్తించారు. దస్త్రాలతో పాటు కంప్యూటర్ హార్డ్ డిస్కులు, గుర్తింపు కార్డులు కూడా ఉండటాన్ని ఏపీ సర్కార్ సీరియస్గా తీసుకుంది. దీంతో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయానికై తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రికార్డుల దహనంపై ఆరా తీశారు. దగ్ధమైన ఫైల్స్, రికార్డుల వివరాలను వెంటనే అందించాలని అధికారులను పవన్ ఆదేశించారు. దస్త్రాల దహనం వెనుక ఎవరున్నారని పవన్ ప్రశ్నించారు. ఈ ఘటనలో ఎవరు బాధ్యులు అయినా వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు పీసీబీ ఆఫీసుల్లో భద్రతకు అనుసరిస్తున్న విధానాలను వెల్లడించాలని పవన్ పేర్కొన్నారు.