బ్రేకింగ్.. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఇంటి వద్ద ఉద్రిక్తత..

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో అధికార వైసీపీ, టీడీపీ మధ్య తీవ్ర పోరు కొనసాగుతోంది. ఇప్పటికే టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అనేక కారణాలతో అరెస్ట్ చేస్తున్నారని ఆ పార్టీ నేతలు పలు ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా కేసరపల్లిలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గన్నవరంలోని పార్టీ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ఆ పార్టీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ […]

Update: 2021-09-08 23:57 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో అధికార వైసీపీ, టీడీపీ మధ్య తీవ్ర పోరు కొనసాగుతోంది. ఇప్పటికే టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అనేక కారణాలతో అరెస్ట్ చేస్తున్నారని ఆ పార్టీ నేతలు పలు ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా కేసరపల్లిలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గన్నవరంలోని పార్టీ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ఆ పార్టీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ అర్జునుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలు పోలీసు జీపు కదలకుండా రోడ్డుపై అడ్డంగా పడుకున్నారు.

ఈ సందర్భంగా బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ.. నారా లోకేష్ పర్యటన అంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందన్నారు. కొవిడ్ నిబంధనలు ప్రతిపక్షాలకేనా.. వైసీపీ కార్యక్రమాలకు వర్తించావా అని ప్రశ్నించారు. ఇడుపులపాయలో వైఎస్ వర్ధంతి కార్యక్రమానికి కరోనా నిబంధనలు గుర్తు రాలేదా అంటూ బచ్చుల అర్జునుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News