Jani Master : పోలీసుల కస్టడీలో జానీ మాస్టర్
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై నార్సింగి పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి.. కోర్టులో హాజరు పర్చగా ఆయనకు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై నార్సింగి పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి.. కోర్టులో హాజరు పర్చగా ఆయనకు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. కాగా ఈ అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జానీ మాస్టర్ ను విచారించేందుకు నాలుగు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును ఆశ్రయించగా.. నాలుగు రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. కాగా కోర్టు అనుమతి ఇవ్వడంతో ఈ రోజు సాయంత్రం చంచల్గూడ జైలు నుంచి పోలీసులు జానీ మాస్టర్ను తమ కష్టడీలోకి తీసుకున్నారు. కాగా జానీమాస్టర్పై థర్డ్ డిగ్రీ ప్రయోగించొద్దని, న్యాయవాది సమక్షంలో విచారించాలని కోర్టు సూచించింది. దీంతో బుధవారం నుంచి శనివారం వరకు జానీ మాస్టర్ నాలుగు రోజుల పాటు పోలీసులు కస్టడీలో ఉండనున్నారు. తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్న 21 ఏళ్ల యువతిపై లైంగిక దాడికి పాల్పడిన జానీ మాస్టర్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే.