మోడీ ఇలాఖాపై కాంగ్రెస్ ఫోకస్.. గుజరాత్‌కు ఇన్‌చార్జి నియామకం

దిశ, తెలంగాణ బ్యూరో: గుజరాత్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌చార్జిగా కత్తి వెంకట స్వామిని నియమించారు.

Update: 2022-04-16 13:17 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: గుజరాత్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌చార్జిగా కత్తి వెంకట స్వామిని నియమించారు. ఈ మేరకు శనివారం ఏఐసీసీ ఓబీసీ విభాగం చైర్మన్ కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ వెల్లడించారు. త్వరలో గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కత్తి వెంకట స్వామి ఇది వరకే జాతీయ సమన్వయకర్తగా, ఈశాన్య రాష్ట్రాలు, వెస్ట్ బెంగాల్ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు గుజరాత్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్‌చార్జిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. కత్తి వెంకట స్వామి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నర్సంపేట ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటి నుంచి నిరంతరం పార్టీ పటిష్టతకు శ్రమిస్తున్నారని, రాష్ట్ర, జాతీయ స్థాయిలో మంచి గుర్తింపును దక్కించుకున్నారని చైర్మన్ అజయ్ యాదవ్ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా వెంకట స్వామి మాట్లాడుతూ.. చైర్మన్ తనపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతలను పూర్తి శ్రద్ధతో నిర్వహిస్తారని, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని, ఈ ఆదేశాలు జారీ చేసిన కెప్టెన్ యాదవ్‌కి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలియజేశారు.

Tags:    

Similar News