Kishan Reddy: చంద్రబాబుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ

Kishan Reddy Writes a letter to Chandrababu Naidu to attend Alluri Sitarama Raju's birth anniversary celebrations| మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల కార్యక్రమంలో భాగస్వాములు కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు

Update: 2022-06-30 10:27 GMT

దిశ, ఏపీ బ్యూరో : Kishan Reddy Writes a letter to Chandrababu Naidu to attend Alluri Sitarama Raju's birth anniversary celebrations| మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల కార్యక్రమంలో భాగస్వాములు కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. జూలై 4న భీమవరంలో ప్రధాని మోడీ పాల్గొనే అల్లూరి జయంతి కార్యక్రమానికి టీడీపీ నుంచి ప్రతినిధిని పంపాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి కిషన్ రెడ్డి లేఖలో కోరారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును సర్మించుకునే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు లేఖలో తెలిపారు. ఆహ్వాన లేఖ రాయడంతో పాటు చంద్రబాబుకు ఫోన్ చేసి పార్టీ నుంచి ప్రతినిధిని పంపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఓ ప్రకటన వెల్లడించింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానంతో భీమవరంలో జరిగే ప్రధాని మోడీ కార్యక్రమంలో చంద్రబాబు సూచనల మేరకు టీడీపీ తరుపున రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పాల్గొననున్నారు.

Tags:    

Similar News