Rabies death : రేబీస్ తో మహిళ మృతి
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎడ్జెర్ల గ్రామంలో రేబీస్ వ్యాధితో ఓ మహిళ మృతి చెందింది.
దిశ, మరిపెడ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎడ్జెర్ల గ్రామంలో రేబీస్ వ్యాధితో ఓ మహిళ మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మృతురాలు జంగం పూలమ్మ(35) పదిహేను రోజుల క్రితం తన పాడి గేదెను పశుగ్రాసం కోసం మేపుతున్న క్రమంలో పిచ్చికుక్క కరవడం జరిగిందని, హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేపించామని తెలిపారు. కానీ గత మూడు రోజుల నుండి
తీవ్ర జ్వరం రావడంతో ఆస్పత్రికి వెళ్లామని రేబీస్ సోకినట్టు వైద్యులు చెప్పగా ఎంజీఎం కి తరలించే క్రమంలో శుక్రవారం పూలమ్మ మృతి చెందినట్లు వారు తెలిపారు. వర్షాకాలం కావడంతో ఆ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటుందని. పెంపుడు కుక్కలైనా, పిచ్చికుక్కలైనా కరిసినప్పుడు సకాలంలో వైద్యం చేసుకుంటూ చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. పూలమ్మ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.