చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో గురువారం చైన్ స్నాచింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2024-10-17 14:43 GMT

దిశ, కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో గురువారం చైన్ స్నాచింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఈ సంవత్సరం జూలై 23వ తేదీన అదే గ్రామానికి చెందిన మాటేటీ రమేష్,మొగిలిచర్ల ప్రశాంత్ మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో గల ఒక ఇంట్లో వృద్ధ మహిళ మెడలో నుంచి సుమారు 3 తులాల బంగారు పుస్తెలతాడు దొంగిలించారు. ఆ బంగారాన్ని అమ్మి లబ్ధి పొందాలనే విషయంలో సహకరించిన పల్లెపు లక్ష్మీనారాయణ,వెనిశెట్టి పున్నం చందర్ లను ఈరోజు ఉదయం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో గూడూర్ ఎక్స్ రోడ్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి 29 గ్రాముల కరిగించిన బంగారపు ముద్ద, రూ. 20వేల నగదును స్వాధీనం చేసుకొని నలుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ ఈ హరికృష్ణ తెలిపారు.


Similar News