పట్టుబడిన కోడి పందాల రాయుళ్లు..

కోడి పందాలు ఆడుతున్న పందెం రాయుళ్లు 18 మందిని ఏటూరు నాగారం పోలీసులు పట్టుకున్నారు.

Update: 2024-10-27 16:10 GMT

దిశ, ఏటూరు నాగారం: కోడి పందాలు ఆడుతున్న పందెం రాయుళ్లు 18 మందిని ఏటూరు నాగారం పోలీసులు పట్టుకున్నారు. ఏటూరు నాగారం మండలం చెల్పక ఊరి పొలిమేరల్లో కొంతమంది కోడి పందాలు నిర్వహిస్తున్నారనే ఉన్నత సమాచారం మేరకు ఏటూరు నాగారం సీఐ అనుముల శ్రీనివాస్ తన సిబ్బందితో ఆకస్మిక దాడులు నిర్వహించి కోడి పందాలు ఆడుతున్న 18 మందిని పట్టుకున్నట్లు సమాచారం. ఈ దాడులలో కోడిపందాలు ఆడుతున్న వారి నుండి 4500 స్వాధీనపరచుకున్నట్లు సమాచారం.. ఈ విషయంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


Similar News