జనగామ జడ్పీ సీఈఓ గా మాధురి షా...

జడ్పీ సీఈఓ గా మాధురి షా గురువారం బాధ్యతలు స్వీకరించారు.

Update: 2024-10-17 10:28 GMT

దిశ, జనగామ: జడ్పీ సీఈఓ గా మాధురి షా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ని కలెక్టరేట్ లో జడ్పీ సీఈఓ మర్యాదపూర్వకంగా కలిశారు. గుజరాత్ సెక్రటేరియట్ సర్వీస్ 2018 బ్యాచ్ కి చెందిన మాధురి షా.. తెలంగాణ రాష్ట్రానికి డిప్యుటేషన్ పైన రావడం జరిగింది. గురువారం నుండి జనగామ జిల్లా జడ్పీ సీఈఓ గా విధులు నిర్వహించనున్నారు.


Similar News