గ్రీవెన్స్ అర్జీలు వెంటనే పరిష్కరించాలి : అశ్విని తానాజీ వాకడే

ప్రజావాణి ఆర్జీలను వెను వెంటనే పరిష్కరించాలని బల్దియా కమిషనర్

Update: 2024-10-14 13:06 GMT

దిశ,వరంగల్ టౌన్ : ప్రజావాణి ఆర్జీలను వెను వెంటనే పరిష్కరించాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని పురస్కరించుకుని బల్దియా ప్రధాన కార్యాలయం కౌన్సిల్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని ప్రజల నుంచి 56 వినతులను స్వీకరించి పరిష్కార నిమిత్తం ఆయా విభాగాల ఉన్నతాధికారులకు అందజేశారు. ఆ ఫిర్యాదుల వివరాలు ఇంజనీరింగ్ విభాగానికి 06, హెల్త్ అండ్ శానిటేషన్ కు 05, ప్రాపర్టీ టాక్స్(రెవెన్యూ)కు 02, టౌన్ ప్లానింగ్ విభాగానికి 39, నీటి సరఫరా కు 04 వినతులు అందజేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ ఇప్పటి వరకు నిర్వహించిన అన్ని విభాగాల ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారం,పెండింగ్ లపై సమీక్షించి ఆయా శాఖలు పెండింగ్ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ రాజేందర్ రెడ్డి, ఎస్ఈలు ప్రవీణ్ చంద్ర, రాజయ్య, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజిరెడ్డి, ఎంహెచ్ఓ రాజేశ్, హెచ్ఓ రమేష్, డిఎఫ్ఓ శంకర్ లింగం, టీపీఆర్ఓ కోలా రాజేష్ కుమార్ గౌడ్, ఇన్చార్జి సీపీ రవీంద్ర రాడేకర్, డిప్యూటీ కమిషనర్ లు కృష్ణారెడ్డి, ప్రసన్న రాణి, టిఓ బిర్రు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


Similar News