ఫ్లాట్ ఇప్పిస్తానని నమ్మించి మోసం.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మహిళా ప్రజాప్రతినిధి భర్తపై ఆరోపణలు..

Update: 2023-06-13 11:27 GMT

దిశ, వేలేరు: వేలేరు మండల కేంద్రంలోని అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ మహిళా ప్రజాప్రతినిధి భర్త హైదరాబాద్ కు చెందిన ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలో తనకు తక్కువ ధరకు ప్లాట్ ఇప్పిస్తానని చెప్పి తన వద్ద రూ.50 వేలు తీసుకుని తనను మోసం చేశాడని మండలం లోని షోడాషపల్లి గ్రామానికి చెందిన మెరుగు వెంకట్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం వేలేరు మండలంలోని సోడాశపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బాధితుడు వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. వేలేరు మండల కేంద్రానికి చెందిన ఇట్టబోయిన భూపతి రాజు 2021 లో శుభమస్తు ఇన్ ఫ్రా ప్రాజెక్ట్‌లోని మార్వేల్ సీటీ ఫేస్-2లో ప్లాట్ ఇప్పిస్తానని చెప్పి తన ఇంటికి కారు పంపించి వెంచర్ వద్దకు తీసుకెళ్లి ఫ్లాట్ చూపించిన తర్వాత రూ. 50వేలు తనతో అడ్వాన్స్ కట్టించుకున్నారని తెలిపారు.

అనంతరం కొన్ని నెలల తర్వాత తన కుటుంబంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవడంతో తాను ఇచ్చిన డబ్బులు తనకి తిరిగి ఇవ్వాలని కోరగా భూపతి రాజు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలిపారు. డబ్బులు తిరిగి ఇస్తామని చెప్పి కొన్ని నెలలుగా జాప్యం చేస్తున్నాడని తెలిపారు. ఎలాగైనా తన డబ్బులు భూపతి రాజు వద్ద నుండి ఇప్పించాలని బాధితుడు వెంకట్ రెడ్డి కోరుతున్నారు.


Similar News