డిగ్రీ అధ్యాపకులు నిరసన ర్యాలీ.. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని డిమాండ్

జనగామ జిల్లాలో డిగ్రీ అధ్యాపకుల నిరవధిక బంద్ లో భాగంగా రెండో రోజు కళాశాల నుండి చౌరస్తా వరకి శాంతియుత ర్యాలీ ద్వారా నిరసన వ్యక్తం చేశారు.

Update: 2024-10-15 07:21 GMT

దిశ, జనగామ : జనగామ జిల్లాలో డిగ్రీ అధ్యాపకుల నిరవధిక బంద్ లో భాగంగా రెండో రోజు కళాశాల నుండి చౌరస్తా వరకి శాంతియుత ర్యాలీ ద్వారా నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు సంవత్సరాల నుండి ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో కళాశాల నిర్వహణ భారంగా మారడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనగామ డిగ్రీ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.


Similar News