కోల్ కతా ఘటన.. ఎన్ ఐటీలో క్యాండిల్‌లైట్ మార్చ్‌

Update: 2024-08-16 14:57 GMT

దిశ కేయూ క్యాంపస్ : కోల్‌కతాలోని ఆర్ జీ కార్ మెడికల్ లో కాలేజీలో మహిళా డాక్టర్ పై జరిగిన హత్యాచారానికి నిరసనగా ఎన్ ఐటిలో కాలేజీ సిబ్బంది, విద్యార్థులు క్యాండిల్‌లైట్ మార్చ్‌ నిర్వహించారు. బాధితురాలికి న్యాయం జరగాలని.. ఆమె కుటుంబ సభ్యులు మరియు స్నేహితులకు సంఘీభావం తెలపడం కోసం సాయంత్రం పరిపాలనా భవనం నుండి గేటు వరకు నిశ్శబ్ద క్యాండిల్‌లైట్ మార్చ్‌ను మౌనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ మన సభ్య సమాజంలో హింసకు, అన్యాయానికి  స్థానం లేదని గట్టిగా చెప్పారు.

Tags:    

Similar News