BREAKING: సమ్మక్క బ్యారేజీలో మొసలి కలకలం.. భయాందోళనలో అధికారులు, మత్స్యకారులు

వేసవి తాపంతో ఒక్కోసారి అనుకోకుండా జలచరాలు జనావాసాల్లోకి వస్తుంటాయి.

Update: 2024-06-11 03:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: వేసవి తాపంతో మనుషులతో పాటు జలచరాలు కూడా జనావాసాల్లోకి వస్తుంటాయి. ఈ క్రమంలోనే ములుగు జిల్లాలోని సమ్మక్క బ్యారేజీలో మొసలి కలకలం రేపింది. అయితే, గోదావరి నుంచి మొసలి ఒక్కసారిగా బ్యారేజీపైకి రావడంతో అధికారులతో పాటు మత్స్యకారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వారి సమాచారంతో రంగంలోకి దిగిన అటవీ సిబ్బంది చాకచక్యంగా మొసలిని ఒడిసిపట్టి మళ్లీ గోదావరి నదిలోకి వదిలేశారు.   


Similar News