వాన పడితే వాగులను తలపిస్తున్న వీధులు

ఇటీవల కురిసిన భారీ వర్షాలు మిగిల్చిన బీభత్సాన్ని

Update: 2024-09-07 14:29 GMT

దిశ,డోర్నకల్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలు మిగిల్చిన బీభత్సాన్ని మరువకముందే శనివారం మరోసారి వరుణుడు ఉగ్రరూపం దాలుస్తోంది.దీంతో పట్టణంలో పలు వీధుల్లో మురికి కాలువలు పొంగి ప్రవహించాయి.కుందోజు వారి వీధిలో కాలువలు పొంగి రోడ్లపై వరద నీరు చేరింది. మున్సిపాలిటీలో మురికి కాలువల ఆక్రమణ,బఫర్ జోన్ నిర్మాణాలు తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.లేని పక్షంలో ప్రకృతి ప్రకోపానికి మూల్యం చెల్లించుకోక తప్పదని మేధావి వర్గాలు హెచ్చరిస్తున్నాయి.మున్సిపాలిటీ అధికారులు హైడ్రా తరహాలో డోడ్రా అమలు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.అధికారులు చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి మరి.


Similar News