25 ఏండ్ల తరువాత కలిసిన చిన్ననాటి మిత్రులు..

వేలేరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 1997-98 సంవత్సరంలో పదోతరగతి పూర్తిచేసుకున్న పూర్వవిద్యార్థులు స్థానిక పాఠశాలలో ఆదివారం ఒకే వేదిక పై చేరుకుని సందడి చేశారు.

Update: 2023-04-16 12:02 GMT

దిశ, వేలేరు : వేలేరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 1997-98 సంవత్సరంలో పదోతరగతి పూర్తిచేసుకున్న పూర్వవిద్యార్థులు స్థానిక పాఠశాలలో ఆదివారం ఒకే వేదిక పై చేరుకుని సందడి చేశారు. దాదాపు 25 సంవత్సరాల తర్వాత కలుసుకున్న చిన్ననాటి స్నేహితులు నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము వివిధ ఉద్యోగాల్లో స్థిరపడ్డామని ఎంతోమంది ఉపాధ్యాయులుగా, రాజకీయ నాయకులుగా, వ్యాపారవేత్తలుగా, అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నామన్నారు.

విద్యార్ధుల అభ్యున్నతికి పాఠశాలలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. రాబోయే రోజుల్లో తాము చదువుకున్న పాఠశాలకు తమవంతు సహకారాన్ని అందిస్తామన్నారు. అనంతరం నాటి గురువులు ఈశ్వరయ్య, రాజిరెడ్డి, సుధాకర్ రెడ్డి, దామోదర స్వామి, భట్టార్, కుమారస్వామి, ఆగయ్య, రమేష్, రంగానాధ్ లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు రేణ నాగేశ్వర్, కూరపాటి రాజ్ కుమార్, రేణ ఈశ్వర్, రాజేంద్రప్రసాద్, మధు, కమల్ కళ్యాణ్, మహేందర్, రాధా, శిరీష, షభాన తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News