30ఏళ్ల తర్వాత..జ్ఞాపకాలతో సంబరపడ్డారు..!

ముప్పై ఏళ్ల కిత్రం వారంతా పదో తరగతి విద్యార్థులు..

Update: 2024-09-29 12:51 GMT

దిశ, వెబ్ డెస్క్: ముప్పై ఏళ్ల కిత్రం వారంతా పదో తరగతి విద్యార్థులు..ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉన్నత స్థానాలలో స్థిరపడ్డారు. నాటి జ్ఞాపకాలతో మళ్లీ తమ చిన్ననాటి ఆనందాలను నెమరవేసుకోనేందుకు మహాబూబాబాద్ వేదిక అయింది. అరవింద విద్యాలయానికి చెందిన 1994–95 బ్యాచ్ కు చెందిన పదో తరగతి విద్యార్థులు ఆదివారం జిల్లా కేంద్రంలో ఆర్ సీ కన్వెన్షన్ హల్ లో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు. అరవింద విద్యాలయం వ్యవస్థాపకుడు ఎన్.చంద్రశేఖర్ తో పాటు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. అనంతరం నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ నాలుగు పదుల వయస్సులోనే చిన్నపిల్లలుగా ఆడిపాడి పండగ చేసుకున్నారు.


Similar News