సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ పర్యటన షెడ్యూల్ ఇదే..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు

Update: 2024-07-08 12:17 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబందించిన షేడ్యూల్ కాంగ్రెస్ ఫర్ తెలంగాణ అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయబడింది. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు ఉమ్మడి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే రేపు తన సొంత జిల్లా అయిన పాలమూరు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఇక్కడ ఉమ్మడి జిల్లా అభివృద్దిపై జిల్లా పరిధిలోని ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అయితే మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు సంబందించిన షెడ్యూల్ విడుదల అయ్యింది.

సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి 12.45 గంటలకు మహబూబ్ నగర్ చేరుకుంటారు. అక్కడ వనమహోత్సవంలో భాగంగా ఐడీఓసీ వద్ద ప్లాంటేషన్ కార్యక్రమం అనంతరం ఉమ్మడి జిల్లా నేతలతో ముఖాముఖి కార్యక్రమం ఉండనుంది. అనంతరం 1.00 గంటలకు మహిళ శక్తి క్యాంటీన్ ప్రారంభోత్సవంతో పాటు వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు. తర్వాత 1.15 నుండి 4.45 వరకు మహబూబ్ నగర్ లోని ఐడీఓసీలో జిల్లా అదికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం జరగనుంది. దీని తర్వాత 5 గంటల నుంచి 5.45 వరకు భూత్ పూర్ రోడ్ లోని ఏఎస్ఎన్ కన్వేన్షన్ హాల్ లో పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులతో సమావేశం ఉంటుంది. ఈ కార్యక్రమాల అనంతరం 6 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ నుంచి తిరుగు ప్రయాణం అవ్వనున్నారు.



Similar News