TG Assembly : : రైతు ఆత్మహత్యలపై అసెంబ్లీలో కూనంనేని కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన రైతు ఆత్మహత్యలపై కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-07-30 09:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన రైతు ఆత్మహత్యలపై కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత 158 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. వ్యవసాయానికి రూ.72 వేల కోట్లు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వ్యవసాయ రంగాన్ని పరిశ్రమగా భావించాలని ప్రభుత్వానికి సూచించారు. పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు వ్యవసాయ రంగానికి వర్తింపజేయాలని కోరారు. ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ ఇన్ని నిధులు ఖర్చు పెడుతున్నా రైతులకు నీరు అందడం లేదన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.   

Tags:    

Similar News