డిప్యూటీ కలెక్టర్లుగా తహశీల్దార్లు.. మంత్రి పొంగులేటి సానుకూల స్పందన

తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ఛన్స్ కల్పించేందుకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Update: 2024-10-06 13:46 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ఛన్స్ కల్పించేందుకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రెవెన్యూ శాఖ ఉద్యోగులలో ఆత్మస్థైర్యం పెంచి కొత్త రెవెన్యూ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలనే దిశగా మంత్రి ఆలోచిస్తున్నారు. తహశీల్దార్ల ఎన్నికల బదిలీలు దసరా కానుకగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఉద్యోగుల జేఏసీ చైర్మన్, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లచ్చిరెడ్డి ప్రతిపాదనలపై మంత్రి సానుకూలంగా స్పందించారు. డిప్యూటీ కలెక్టర్లు/స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల ముఖాముఖి సమావేశంలో అంశాల వారీగా పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు ఆమోదించారు. వేదికపైనే రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ని ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారు.

స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల కేడర్ స్ట్రెంగ్త్ పెంపు, సెలక్షన్ గ్రేడ్ గా నిర్ధారించి (33)పోస్టులు అప్ గ్రేడ్ చేయడం,17 మంది సీనియర్ అదనపు కలెక్టర్ కేడర్ అధికారులకు ఐఏఎస్‌లుగా పదోన్నతికి మార్గం సుగమం చేశారు. డిప్యూటీ కలెక్టర్ నుంచి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌గా( 50)మందికి పదోన్నతులు. 33 జిల్లాలలో డీఆర్వో పోస్టులు భర్తీ చేసే అవకాశం కల్పించారు. పై నుంచి పదోన్నతుల ఫైల్ కదిలితే మరో (80) మంది తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ఛాన్స్ కూడా రానుంది. గ్రామ రెవెన్యూ వ్యవస్థను పటిష్టపరిచి గ్రామానికో రెవెన్యూ అధికారిని నియమించుటకు ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. రైతులకు, సామాన్య ప్రజలకు మెరుగైన భూ సేవలు అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటున్నది. రెవెన్యూ వ్యవస్థను పటిష్టపరిచి జవాబుదారీ తనంతో కూడిన సేవలు అందించేందుకు ఆలోచన చేస్తుంది. ఈ కార్యక్రమంలో డీసిఏ అధ్యక్షులు వి.లచ్చిరెడ్డి తో పాటు ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ, నాయకులు బి.గీత, చంద్రారెడ్డి, మాధవి దేవి తదితరులు పాల్గొని వివిధ అంశాలపై సూచనలు అందించారు.


Similar News