Thummala Nageswara Rao : రేపు గాంధీభవన్ కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం గాంధీ భవన్ ముఖాముఖి కార్యక్రమానికి హాజరు కానున్నారు.

Update: 2024-10-06 14:42 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం గాంధీ భవన్ ముఖాముఖి కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఉదయం 11 గంటల నుంచి ముఖాముఖి కార్యక్రమం ప్రారంభం కానున్నది. మూడు గంటల పాటు ప్రజలు, పార్టీ కార్యకర్తలకు సంబంధించిన సమస్యలను మంత్రి తుమ్మల నేరుగా పరిశీలించనున్నారు. వచ్చిన అప్లికేషన్లను సంబంధిత శాఖలు, మంత్రులు, అధికారులకు రిఫర్ చేయనున్నారు. తక్షణమే పరిష్కారమయ్యే సమస్యలను జిల్లా కలెక్టర్లతో మాట్లాడి అప్పటికప్పుడే క్లీయర్ చేయనున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని టీపీసీసీ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నది.


Similar News