స్కిల్ యూనివర్సిటీపై గెజిట్ నోట్ విడుదల చేసిన తెలంగాణ సర్కార్

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Update: 2024-08-14 17:24 GMT

దిశ, వెబ్ డెస్క్ : యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లును ఆదేరోజు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో న్యాయశాఖ నేడు గెజిట్ జారీ చేసింది. స్కిల్ యూనివర్సిటీలో 17 కోర్సుల్లో ప్రతి ఏటా 20 వేల మందికి శిక్షణ ఇవ్వనున్నారు. రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు మండలం మీర్ ఖాన్ పేట్ లో సీఎం రేవంత్ రెడ్డి యూనివర్సిటీ శంఖుస్థాపన చేశారు. అలాగే ఈ యూనివర్సిటీకి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఛైర్మన్ గా వ్యవహరిస్తారని సీఎం ఇటీవల ప్రకటించారు.  


Similar News