NTR దేవర చిత్రబృందానికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
జూనియర్ ఎన్టీఆర్(NTR) ప్రధాన పాత్రలో నటించిన దేవర చిత్ర(Devara Movie) బృందానికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
దిశ, వెబ్డెస్క్: జూనియర్ ఎన్టీఆర్(NTR) ప్రధాన పాత్రలో నటించిన దేవర చిత్ర(Devara Movie) బృందానికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణలో దేవర సినిమా టికెట్ల ధరలు పెంచుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మిడ్నైట్ షోకు 29 థియేటర్లలో అనుమతులు ఇచ్చింది. సినిమా విడుదలైన తొలిరోజు మొత్తం ఆరు షోలకు అనుమతి ఇవ్వడంతో పాటు టికెట్పై రూ.100 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఈనెల 28 నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు రోజుకు ఐదు షోలు వేసుకునేందుకు ఛాన్స్ ఇచ్చారు. సింగిల్ స్క్రీన్లలో టికెట్పై రూ.25, మల్టీప్లెక్స్లలో టికెట్పై రూ.50 పెంచుకునేందుకు అవకాశం కల్పించారు. కాగా.. ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రమిది. జాన్వీ కపూర్ హీరోయిన్. సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషించారు. ఈ నెల 27న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.