Lorry Hijack : రాష్ట్రంలో షాకింగ్ ఘటన.. పసుపు లోడ్‌తో వెళ్తున్న లారీ హైజాక్

విమానం, సముద్రంలో ఓడలను హైజాక్ చేయడం గురించి విన్నాం..

Update: 2024-07-19 02:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: విమానం, సముద్రంలో ఓడలను హైజాక్ చేయడం గురించి విన్నాం.. కానీ తాజాగా రాష్ట్రంలో ఓ సంచలన ఘటన చోటు చేసుకుంది. ఏకంగా పసుపు లోడుతో వెళ్తున్న లారీని కొంత మంది కేటుగాళ్లు హైజాక్ చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో పసుపు లోడుతో వెళ్తున్న లారీని ఆర్టీఏ అధికారులమంటూ టోల్ ప్లాజా వద్ద దుండగలు ఆపారు. డ్రైవర్‌కు మత్తు మందు ఇచ్చి జన్నేపల్లి వైపు లారీని దుండగలు తీసుకెళ్లారు. అయితే పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో దుండగులు పారిపోయారు. లారీలో సుమారు రూ.50 లక్షల విలువైన పసుపు ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసి నిజామాబాద్ ఒకటో ఠాణా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.     


Similar News