తెలుగు రాష్ట్రాల్లో సాంకేతిక సమస్యతో ఆగిన రిజిస్ట్రేషన్లు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఆధార్ లింక్ కాకపోవడంతో మధ్యాహ్నం నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సేవలు నిలిచిపోయాయి. యూడీఐఏలో ఈకేవైసీలో వెరిఫికేషన్కు సంబంధించి సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో రిజిస్ట్రేషన్ ఆఫీసుల వద్ద జనం పడిగాపులు కాస్తున్నారు. ఈ రోజు స్లాట్ బుక్ చేసుకున్న వారికి రేపు(శుక్రవారం) రిజిస్ట్రేషన్ చేస్తామని సిబ్బంది చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సేవలను వెంటనే పునరుద్ధరించాలని పలువురు కోరుతున్నారు.