ప్రైవేట్ దవాఖానాలకు ధీటుగా ప్రభుత్వ దవాఖానాల్లో సేవలందిస్తున్నాం : ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

పెద్దేముల్ మండలంలో ఎమ్మెల్యే బుయ్యాన్ని మనోహర్ రెడ్డి

Update: 2024-07-02 13:49 GMT

దిశ,పెద్దేముల్ : పెద్దేముల్ మండలం లో ఎమ్మెల్యే బుయ్యాన్ని మనోహర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పెద్దేముల్ మండల కేంద్రంలో రూ.కోటిన్నారా నిధులతో నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని ప్రభుత్వ ఆసుపత్రుల లో సౌకర్యాలు కల్పిస్తామని మెరుగైన వైద్యాన్ని ప్రజలకు అందించాలని వైద్యాధికారులను కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వైద్యానికి విద్యకి పెద్దపీట వేస్తూ ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న కూడా అధిక నిధులు కేటాయిస్తు సీఎం రేవంత్ రెడ్డి ప్రజాసేవకే పరితపిస్తున్నరాని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డితో పాటు జడ్పీటీసీ దారా సింగ్, ఎంపీపీ అనురాధ, వైస్ ఎంపీపీ మధులత డీఎంహెచ్ఓ పాల్వాన్ కుమార్, వైద్యాధికారి బుచ్చిబాబు, ఎమ్మార్వో కిషన్ నాయక్, ఎంపీడీవో జర్నప్ప, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శోభారాణి టిపిసిసి మైనార్టీ రాష్ట్ర కన్వీనర్ రియాజ్, కో ఆప్షన్ సభ్యులు నసిర్, ఆయా శాఖల అధికారులు నాయకులు పాల్గొన్నారు.

Similar News