చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

ఇబ్రహీంపట్నం చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని

Update: 2024-07-04 10:34 GMT

దిశ,ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని ఇబ్రహీంపట్నం పోలీసులు బయటకు తీశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చెరువులో గురువారం రోజు ఉదయం 11:30 నిమిషాల సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి వయస్సు సుమారు 55 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు గల వ్యక్తి చెరువులో పడి చనిపోయి మృతదేహం నీటిపై తెలియాడు తుండగా సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి ఇబ్రహీంపట్నం మార్చరీకి తరలించడం జరిగింది. మృతదేహం పై తెలుపు రంగు షర్ట్, బనియన్, బూడిద రంగు ఫ్యాంట్, నిక్కర్ ధరించాడు. ఈ వ్యక్తిని ఎవరైనా గుర్తుపట్టినట్లైతే ఈ క్రింది ఫోన్ నెంబర్లను సంప్రదించగలరు ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ తెలిపారు. ఇబ్రహీంపట్నం ఎస్ హెచ్ ఓ : ఫోన్ నెంబర్. 8712662361, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్: 8712662419.


Similar News