ది కేవ్ బార్ అండ్ లాంజ్పై పోలీసుల దాడులు.. 24 మంది అరెస్ట్
సైబరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపుతోంది. ఆదివారం రాత్రి ఖాజాగూడాలోని ది కేవ్ బార్ అండ్ లాంజ్లో తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో, ఎస్ఓటీ, రాయదుర్గం పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు.
దిశ, శేరిలింగంపల్లి: సైబరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపుతోంది. ఆదివారం రాత్రి ఖాజాగూడాలోని ది కేవ్ బార్ అండ్ లాంజ్లో తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో, ఎస్ఓటీ, రాయదుర్గం పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ప్రముఖ డీజే గౌరవ్ తో పాటు పలువురు యువతీ యువకులు డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడ్డారు. దాడులు మొత్తం 50 మందికి టెస్ట్లు చేయగా 24 మందికి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వీకెండ్ ఈవెంట్ పేరుతో నిర్వహించిన ఈ పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారు. ఎవరు డ్రగ్స్ సప్లై చేశారు. ఎక్కడి నుంచి సరఫరా చేస్తున్నారనేదానిపై విచారణ జరుపుతున్నట్లు రాయదుర్గం పోలీసులు తెలిపారు. ఈవెంట్ ఆర్గనైజర్ పై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు.