సీఎంఆర్ లక్ష్యం చేరేనా..?
రంగారెడ్డి, వికారాబాద్జిల్లాలో ధాన్యం దిగుబడి తక్కువగా ఉండడంతో టెండర్లతో పనిలేకుండా కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) కోసం మాత్రమే మిల్లులకు సరఫరా చేయనున్నారు.
దిశ, రంగారెడ్డి బ్యూరో: రంగారెడ్డి, వికారాబాద్జిల్లాలో ధాన్యం దిగుబడి తక్కువగా ఉండడంతో టెండర్లతో పనిలేకుండా కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) కోసం మాత్రమే మిల్లులకు సరఫరా చేయనున్నారు. రంగారెడ్డి జిల్లాలోని కేవలం 5 మిల్లులు, వికారాబాద్లోని 10 మిల్లులకు మాత్రమే ధాన్యాన్ని అప్పగిస్తారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయించిన తేదీలోపు సీఎంఆర్ను తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. అదే పద్ధతిలో రంగారెడ్డి జిల్లాలో 70 శాతం, వికారాబాద్లో 10 శాతం సీఎంఆర్ సేకరించారు. మిగిలిన సీఎంఆర్ అందుబాటులో ఉన్నప్పటికి సివిల్ సప్లై అధికారులు సూచనతో అడుగులు వేయనున్నట్లు అధికారులు వివరిస్తున్నారు. కేవలం రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో సేకరించిన ధాన్యం కేవలం ఎఫ్సీఐకి మాత్రమే కేటాయించినట్లు తెలుస్తోంది.
రంగారెడ్డి జిల్లాలో 4 శాతమే సీఎంఆర్ బకాయి..
2022-23 వానాకాలం సీజన్లో పౌర సరఫరాల శాఖ (సివిల్ సప్లై), డీఆర్డీఏ, ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యంలో రంగారెడ్డి జిల్లాలో ఐదు మిల్లర్ల ద్వారా 13,825 మెట్రిక్ టన్నుల బియ్యం సీఎస్సీ, ఎఫ్సీఐకి అందజేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 13,188 మెట్రిక్ టన్నుల బియ్యం అందజేయగా.. మిగిలిన 4శాతం సీఎంఆర్చెల్లించాల్సి ఉంది. అయితే అమన్గల్లులోని రైస్మిల్లర్ల యాజమాన్యం సకాలంలో బియ్యం సరఫరా చేయకపోవడంతో కేసు నమోదు చేసినట్లు సంబంధిత జిల్లా అధికారి వివరించారు.
గడువు ముగియడంతో సీఎంఆర్ కు జాప్యం..
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని 2022–23 రబీ సీజన్కు సంబంధించిన ధాన్యం ఆశించిన స్థాయిలో సేకరించారు. రంగారెడ్డిలో 41,305 మెట్రిక్ టన్నులు, వికారాబాద్లో 1,07,657 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్లకు తరలించారు. ఇందులో సీఎంఆర్ద్వారా రంగారెడ్డికి 27,877, వికారాబాద్కు 72,771 మెట్రిక్ టన్నుల చొప్పున మిల్లర్లు అందజేయాలి. ఇప్పటి వరకు రంగారెడ్డికి 19,845 మెట్రిక్టన్నులు (70శాతం), వికారాబాద్కు 70,002 మెట్రిక్ టన్నులు (10శాతం ) చొప్పున మాత్రమే ఎఫ్సీఐ, సీఎస్సీకి అప్పగించారు. మిగిలిన రైస్రంగారెడ్డిలో 8,600, వికారాబాద్లో 65,769 మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్లు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం మిల్లర్ల వద్ద బియ్యం అందుబాటులో ఉన్నప్పటికీ ఎఫ్సీఐ తీసుకునేందుకు సమయం ఇవ్వకపోవడంతో జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. వికారాబాద్ జిల్లాలో మాత్రం మిల్లర్లు కావాలనే సీఎంఆర్ చెల్లింపునకు నిర్లక్ష్యం చేస్తున్నట్లు తెలుస్తోంది.
2023–24 వానాకాలం, యాసంగి సీఎంఆర్ చెల్లింపు అక్టోబర్ వరకు..
వానకాలం, యాసంగి సీజన్లో ప్రభుత్వం సేకరించిన ధాన్యం రైస్మిల్లర్లకు తరలించారు. వానకాలం సీజన్లో రంగారెడ్డిలో 9,879 మెట్రిక్టన్నుల ధాన్యం మిల్లర్లకు తరలిస్తే.. 6,663 మెట్రిక్ టన్నుల బియ్యం సీఎంఆర్ద్వారా చెల్లించాలి. కానీ 4,939 మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్సీఐకి, సీఎస్సీకి అప్పగించారు. వికారాబాద్లో 44,252 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్లకు పంపిణీ చేస్తే 29,558 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి చెల్లించాలి. కానీ కేవలం 14,363 మెట్రిక్ టన్నులు మాత్రమే అప్పగించారు. రంగారెడ్డిలో 74శాతం, వికారాబాద్లో 52 శాతం చొప్పున చెల్లించడంతో అనుమానాలకు తావిస్తున్నది. అక్టోబర్ నెల వరకు సీఎంఆర్చెల్లించే అవకాశం ఎఫ్సీఐ కల్పించినట్లు అధికారులు వివరిస్తున్నారు. యాసంగి సీజన్లోని ధాన్యం కూడా రంగారెడ్డిలో 12,167 మెట్రిక్ టన్నులు, వికారాబాద్లో 38,671 మెట్రిక్ టన్నులు మిల్లర్లకు పంపిణీ చేశారు. సీఎంఆర్ ద్వారా రంగారెడ్డికి 8,273, వికారాబాద్కు 26,296 మెట్రిక్ టన్నుల చొప్పున బియ్యం అప్పగించారు. ఇంకా రంగారెడ్డిలో 7983, వికారాబాద్లో 23,717 మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్సీఐకి అప్పగించాల్సి ఉందని అధికారిక వివరాలు చెబుతున్నాయి.
2023–24 సీజన్ సీఎంఆర్కు సమయం ఉంది
సీఎంఆర్ ద్వారా ఎఫ్సీఐకి, సీఎస్సీకి అందాల్సిన బియ్యం సకాలంలోనే వస్తుంది. రంగారెడ్డి జిల్లాలో 2022–23 వానకాలం సీజన్లో సీఎంఆర్ 4 శాతం బకాయి ఉంది. అందుకు కారణమైన అమన్గల్లు రైస్మిల్లుల్లో స్టాక్ లేదని జాప్యం చేస్తున్నారు. దీంతో ఆ మిల్లు యాజమాన్యంపై కేసు నమోదు చేశాం. 2023–24 వానకాలం, యాసంగి సీజన్లో సేకరించిన ధాన్యం మిల్లులకు తరలించారు. సీఎంఆర్ ద్వారా జిల్లాకు రావాల్సిన బియ్యం తీసుకుంటున్నాం. 2023–24 సీజన్కు సంబంధించి సీఎంఆర్ తీసుకోవడంలో అక్టోబర్ వరకు సమయం ఉంది. :–విజయలక్ష్మి, జిల్లా మేనేజర్ రంగారెడ్డి