మంత్రాల చెరువు పనులు త్వరితగతిన పూర్తి చెయ్యండి : సబితా ఇంద్రారెడ్డి

మంత్రాల చెరువు సుందరీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు

Update: 2024-07-04 11:12 GMT

దిశ, మీర్ పేట్: మంత్రాల చెరువు సుందరీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కార్పొరేషన్ పరిధిలోని మంత్రాల చెరువు వద్ద మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, అధికారులతో కలిసి ఎమ్మెల్యే చెరువు సుందరీకరణ పనులు పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చెరువులోకి మురుగు నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని, చెరువు వద్ద నంది విగ్రహం ఏర్పాటు చేయాలని, వాకింగ్ కి వచ్చిన వాకర్స్ కోసం బెంచీలు ఏర్పాటు చేయాలని చెట్ల మొక్కలతో పాటు బతుకమ్మ ఘాటును సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే తో పాటు కమిషనర్ చంద్రశేఖర్, డీఈఈ వెంకన్న, ఏఈ శ్రీనివాసులు, ఆర్ఎఫ్ సుధీర్, ఫ్లోర్ లీడర్ భూపాల్ రెడ్డి, కామేశ్ రెడ్డి, భూపేష్ గౌడ్,బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు


Similar News